ప్రభుత్వం వ్యాపారస్తులను ప్రోత్సహిస్తుందిః మేయర్

398
Bonthu Rammohan
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం వ్యాపారస్తులందరిని ప్రొత్సహిస్తూ రక్షణ కల్పిస్తుందన్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 12 లో ఉన్న మహరాజ్ అగ్రసేన్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు హోం మంత్రి మహ్మద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు.

మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేందుకు కమ్మయూనిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహరాజ్ అగ్రసేన్ కలలు కన్న నగరం హైదరాబాద్ అని చెప్పారు. భవిష్యత్ తరాలకు పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం:12కు మహారాజ్ మార్గ్ గా నామకరణం చేయాలన్న మీ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

హోం మంత్రి మహ్మద్ అలీ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు చేపట్టినట్లు తెలిపారు శాంతి భద్రతల విషయంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్ధానంలో ఉందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్ లో నివసిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు.

- Advertisement -