Mass Jathara:’మాస్ జాతర’..టీజర్

5
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేయగా రైల్వే పోలీస్‌గా కనిపించనున్నారు రవితేజ. ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Also Read:కమల్ హాసన్‌కు బెదిరింపులు

- Advertisement -