స్వర్ణం సాధించిన మేరీకోమ్‌..

392
Mary Kom Win Gold
- Advertisement -

భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన ఇండోనేసియా 23వ ప్రెసిడెంట్స్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో ఈ మణిపూర్‌ మణిపూస‌(51 కేజీలు) ఆస్ట్రేలియా బాక్సర్‌ ఫ్రాంక్స్ ఎప్రిల్‌ను 5-0తో చిత్తు చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్‌లు విసురుతూ.. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకొని భారత్‌కు పసిడిని అందించింది.

Mary Kom

బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌ ఈ ఏడాది మేలో జరిగిన భారత ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లోనూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సెప్టెంబర్‌ 7నుంచి 21 తేదీల్లో రష్యాలో జరగనున్న ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2019లో మేరీకోమ్‌ పాల్గొననుంది.

ఈ విజయానంతరం పతకాన్ని అందుకున్న క్షణాలను ట్వీట్‌ చేస్తూ మేరికోమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. ‘ప్రెసిడెంట్స్‌ కప్‌ ఇండోనేషియాలో నా దేశానికి.. నాకు స్వర్ణం దక్కింది. గెలవడమంటే ఎంత దూరమైన వెళ్లడానికి, అందరికంటే ఎక్కవ కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. నా కోచ్‌లకు, సహాయక సిబ్బందికి మనస్పూర్తిగా ధన్యవాదాలు’ అని తెలిపింది.

- Advertisement -