మనసు మార్చుకున్న నాగచైతన్య..

225
Maruthi Movie with Naga CHaitanya
- Advertisement -

యుద్ధం శరణం చిత్రం ఘోర పరాజయం పొందడంతో అక్కినేని నాగచైతన్య డైలమాలో పడ్డాడు . ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చందూ మొండేటి దర్శకత్వంలో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. సవ్యసాఛి పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమానే తన నెక్ట్స్ సినిమా అంటూ కన్ఫామ్ చేశాడు. అయితే యుద్ధం శరణం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో చైతూ మనసు మార్చుకున్నాడట.

naga-chaitanya-

యాక్షన్ ఇమేజ్ కోసం అక్కినేని నాగచైతన్య ఎప్పటి నుండో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం ! కానీ ఒక్కటే ” తడాకా ” హిట్ అయ్యింది తప్ప మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి . తాజాగా యుద్ధం శరణం కూడా ప్లాప్ కావడంతో ఇక తదుపరి ఏ సినిమా చేయాలా అన్న సంశయం లో ఉన్నాడు చైతూ. నాగచైతన్య ముందుగా మారుతి సినిమా చేయాలనీ, ఆ తరువాతనే చందూ మొండేటితో ‘సవ్యసాచి’ చేయాలని చైతూ భావిస్తున్నాడని టాక్.

Yuddham-Sharanam-Movie-

సవ్యసాచి సినిమా యాక్షన్ మూవీగా రూపొంద‌నుండ‌గా, మారుతి చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. శర్వానంద్ హీరోగా మారుతి తెరకెక్కించిన మహానుభావుడు ఈ నెలాఖరున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి నాగచైతన్య నిర్ణయం తీసుకోనున్నాడు.

- Advertisement -