మేడ్చ‌ల్ లో ఉచిత భోజ‌న వ‌స‌తిని ప్రారంభించిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి

278
- Advertisement -

క‌రోనా నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించింన సంగ‌తి తెలిసిందే. దీంతో మేడ్చ‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న వ‌ల‌స కార్మికుల‌కు ఉచిత భోజ‌న వ‌స‌తి ప్రారంభించారు టీఆర్ఎస్ మ‌ల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్ ఛార్జ్ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి.

ఈసంద‌ర్భంగా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పేద ప్రజలను ఆదుకోవడమే మన కర్త‌వ్వం అన్నారు. మేడ్చల్ పట్టణం లోని దివానా దాబా తో పాటు మిగిలిన 4 సెంటర్ లో ఉన్న వలస కార్మికులకు తాత్కాలిక వసతి తో పాటు భోజన సదుపాయాల తో పాటు ,మంచి నీరు ,మునిసిపల్ ‌చైర్మన్ మరియు కౌన్సిలర్ ల సహాయం తో మేడ్చల్ పోలీసు సి.ఐ ఆద్వర్యంలో నిర్వహించటం జరిగింది అన్నారు. ఇట్టి సౌకర్యం వలస కార్మికులు, దినసరి కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -