పేదింటి ఆడబిడ్డకు అండగా మర్రి..

1
- Advertisement -

పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. పేద విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకు ఆర్థిక సహాయం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ – పెంట్లవెల్లి మండలంలోని జెట్ ప్రోలు గ్రామానికి చెందిన సులిగురి ఉషమ్మ వెంకటయ్య దంపతుల కుమార్తె ప్రహర్ష కు నారాయణపెట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు రావడంతో ఆర్ధిక ఇబ్బందులు వల్ల తమ కుమార్తెను చదివించలేకపోతున్నాం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదవడానికి మా MJR ట్రస్ట్ ద్వారా మొదటి సంవత్సరం ఫీజు 75 వేలు రూపాయల ఆర్ధిక సహాయం అందజేసి ఎంబీబీఎస్ చదువు పూర్తి అయ్యే వరకు ఇంకా మూడు సంవత్సరాల ఫీజు మా ట్రస్ట్ ద్వారానే చెల్లిస్తా అని అమ్మాయికి బరోసా ఇవ్వడం జరిగిందన్నారు.

Also Read:మహేష్‌ – రాజమౌళి మూవీ..క్రేజీ అప్‌డేట్!

- Advertisement -