అసలు ఎవరిది వక్రబుద్ధి చిరంజీవి?

39
- Advertisement -

నటుడు మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. త్రిష‌తో నేను చేసే స‌న్నివేశాలలో రేప్ సీన్ లేకపోవడం బాధగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. దీనిపై తర్వాత క్షమాపణలు సైతం చెప్పాడు. ఐతే, మెగాస్టార్‌ చిరంజీవి దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ల వరకూ మన్సూర్ కామెంట్స్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి పై మన్సూర్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి నన్ను వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై నేను స్పందించాలి. అసలు ఎవరిది వక్రబుద్ధి చిరంజీవి ? అని మన్సూర్ ప్రశ్నించారు.

మన్సూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘చిరంజీవి ఓ రాజకీయ పార్టీ పెట్టి దాదాపు రూ.1000 కోట్లు సంపాదించాడు. వచ్చిన సంపాదనంతా వాళ్లు వాళ్ల కోసమే వాడుకుంటున్నాడు. చిరంజీవిపై రూ. 20 కోట్లు, త్రిష, ఖుష్బూ లపై రూ.10 కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తాను అంటూ మన్సూర్ రెచ్చిపోయాడు. పనిలో పనిగా ఖుష్బూ పై కూడా మన్సూర్ కామెంట్స్ చేస్తూ.. ఖుష్బూ గారు మంచి వ్యక్తి. ఆమె ఎదుటి వారి సంతోషాన్ని కోరుకునే వ్యక్తి. ఆమె గురించి నేను ఏం చెప్పగలను ?, ఆమెలో చాలా విషయాలు ఉన్నాయి. ఆమె చరిత్ర చూసుకుంటే.. బూతు కూడా సిగ్గు పడుతుంది’ అంటూ మన్సూర్ కామెంట్స్ చేశాడు.

మొత్తానికి మన్సూర్ తాజాగా తన వ్యాఖ్యలను నటి త్రిష, ఖుష్బూ, హీరో చిరంజీవి ఎడిట్ చేసి తప్పుగా మాట్లాడినట్లు చిత్రీకరించి తనను మానసికంగా బాధించారని దీనిపై కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపాడు. మరి ఈ కామెంట్స్ మెగాస్టార్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం వ‌శిష్ఠ‌తో విశ్వంభ‌ర సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి త‌న త‌ర్వాతి సినిమాను కూడా లాక్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌రో సినిమా కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం అనీల్ రావిపూడి- మెగాస్టార్ చిరూ కాంబో దాదాపు ఖాయ‌మైనట్లు రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్:మధిరలో భట్టికి ఓటమి తప్పదా?

- Advertisement -