కేంద్రమంత్రిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీ..

524
mp manne srinivas reddy
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి కలిశారు. జడ్చర్ల పట్టణంలో ప్రస్తుతం ఉన్న రైల్వే గేట్‌ను రోడ్ అండర్ బ్రిడ్జిగా మార్చాలని మంత్రికి ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.

దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిలు కూడా ఇదే సమస్యపై ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసారని ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు.

- Advertisement -