‘మన్మధుడు 2’ సెన్సార్ పూర్తి..

431
Manmadhudu 2
- Advertisement -

కింగ్ నాగార్జున- రకుల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం `మన్మధుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. నాగార్జున- జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9 రిలీజవుతోంది. ఇది మన్మధుడుకి సీక్వెల్ సినిమా కాదని నాగార్జున స్వయంగా వెల్లడించారు. అలాంటి జోనర్ మాత్రమే. రొమాన్స్ .. ఫన్ .. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.

Manmadhudu 2

సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో ఝాన్సీ,దేవదర్శి. కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.

- Advertisement -