ఆస్పత్రిలో మణిరత్నం!

52
maniratnam
- Advertisement -

లెజండరీ దర్శకుడు మణిరత్నం ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే రెండు సార్లు ఆయనకు గుండెపోటు రాగా తాజాగా మణిరత్నం ఆస్పత్రిలో చేరడంతో అంతా ఆందోళన చెందగా డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

కరోనా కారణంగా ఆయన చెన్నైలోని అపోలో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న‌కు చికిత్స అందుతోంది.

ప్ర‌స్తుతం చోళ సామ్రాజ్యం బ్యాగ్రౌండ్‌తో పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే సినిమాను ఆయ‌న రూపొందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్‌తో క‌లిసి ఆయ‌న మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు పార్టులుగా సినిమా తెరకెక్కుతుండగా ఫస్టాఫ్ సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ కానుంది.

- Advertisement -