మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ అధికారికంగా మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది. 25 ఏళ్ల ఈ అందగత్తె, పోటీ ప్రారంభంలో ఒక థాయ్ పేజెంట్ డైరెక్టర్ ఆమెను గద్దించిన తర్వాత, తన ఈవెనింగ్ గౌన్ మరియు హీల్స్తో వాకౌట్ చేసినప్పటికీ, అభిమానుల ఫేవరెట్గా నిలిచింది.
గత ఏడాది విజేత, డెన్మార్క్కు చెందిన విక్టోరియా కైర్ థెయిల్విగ్, ఫాతిమాకు కిరీటాన్ని అలంకరించింది. కిరీటం అందుకుంటున్న సమయంలో ఫాతిమా బోష్ భావోద్వేగానికి లోనై ఆనందంతో ఉప్పొంగిపోయింది. కన్నీటి పర్యంతమవుతున్న ఫాతిమాను, ఆమె తోటి అందాల రాణులు ఓదార్చారు.
టాప్-12 రౌండ్ లో నిరాశ పరిచింది మణికా విశ్వకర్మ. 2025 మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మణిక విశ్వకర్మ టాప్ 30కి చేరుకున్నప్పటికీ, టాప్ 12 లోకి అడుగుపెట్టలేకపోయింది. దీంతో 2021లో హర్నాజ్ కౌర్ సంధు విజయం తర్వాత మళ్లీ కిరీటం కోసం భారతదేశం యొక్క నిరీక్షణ కొనసాగుతోంది. రాజస్థాన్లోని గంగానగర్కు చెందిన మణిక, 100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో పోటీపడింది. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆమె, తన అందం మరియు గుర్తుండిపోయే జాతీయ దుస్తుల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read:’12A రైల్వే కాలనీ’…డిఫరెంట్ జోనర్
మణిక విశ్వకర్మ 22 ఏళ్ల ఇండియన్ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్ మరియు యువత న్యాయవాది. ఆమె రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు చెందినది. ఆగస్టు 18, 2025న రాజస్థాన్లోని జైపూర్లో 48 మంది పోటీదారులతో పోటీపడి ఆమె మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె అంతకుముందు మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 గెలిచి, ఆ సంవత్సరం జాతీయ స్థాయిలో టాప్ 20లో నిలిచి “బెస్ట్ ఇన్ స్పీచ్” అవార్డును కూడా అందుకుంది.

