- Advertisement -
మిస్ యూనివర్స్ ఇండియాగా మణిక విశ్వకర్మ నిలిచారు. రాజస్థాన్-జైపూర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ పోటీలు జరిగాయి. ఈ పోటీలో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది మణిక విశ్వకర్మ.
మణికకు కిరీటాన్ని అలంకరించారు 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా. రాజస్థాన్లో పుట్టిన మణిక.. ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది మణిక.
Also Read:KTR:చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి
- Advertisement -

