రేవంత్‌పై మందకృష్ణ ఫైర్

9
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై తనదైన శైలీలో మండిపడ్డారు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. మీడియాతో మాట్లాడిన మందకృష్ణ…రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పటికీ మెజారిటీ ఎంపీ స్థానాలు ఎందుకు గెలవలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ ఉండదని.. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండరని హెచ్చరించారు. మాదిగలకు చేసిన మోసానికి కచ్చితంగా రేవంత్‌ రెడ్డి రుణం తీర్చుకుంటామని చురకలు అంటించారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.

Also Read:దేశంలో బలమైన ప్రతిపక్షం:రాహుల్

- Advertisement -