నీకోసం నుండి దూకుడు వరకు వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు శ్రీను వైట్ల. తనకు అందివచ్చన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అగ్రహీరోలతో సినిమాలు తీసి బెస్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న శ్రీనువైట్ల కాస్త గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. వరుణ్ తేజ్తో మిస్టర్,రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు తీసిన బాక్సాఫీస్ వద్ద ఢీలా పడ్డాయి.
ఈ సారి ఎలాగైన సక్సెస్ కొట్టాలని కసితో ఉన్న ఈ కామెడీ చిత్రాల దర్శకుడు తాజాగా మంచు వారబ్బాయితో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. త్వరలో మంచు విష్ణుతో కలిసి ఓ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఈ న్యూస్ని మీడియాతో పంచుకున్నారు విష్ణు. శ్రీనుతో సినిమా చేస్తున్నాను ఫుల్ హ్యాపీస్ అంటూ తెలిపారు.
గతంలో శ్రీను వైట్ల- విష్ణు కాంబినేషన్లో వచ్చిన ఢీ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. విష్ణు కెరీర్ని మలుపు తిప్పిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని స్క్రిప్ట్ రెడీని చేస్తున్నారట శ్రీను వైట్ల. ఫన్ అండ్ ప్రస్టేషన్తో ఈసారి పక్కా హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్న శ్రీను-విష్ణుతో ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.