మరో మ‌ల్టీస్టార‌ర్‌.. ‘మనోజ్’కే కీలకం

32
- Advertisement -

మంచు మనోజ్ మళ్లీ హీరోగా యాక్టివ్ కాబోతున్నాడు. ఇప్పటికే, పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీలో చేస్తున్న ఓ మ‌ల్టీస్టార‌ర్‌ లో మంచు మనోజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ క‌లిసి ఆర్ఆర్ఆర్‌తో స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ క్రమంలోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ సైలెంట్ గా తెర‌కెక్కుతున్న‌ట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీలో ఈగ‌ల్ డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను మొద‌లుపెట్టారు. ఇందులో నలుగురు హీరోలు ఉన్నారు. వారిలో మంచు మనోజ్ కూడా ఒకరు.

ఇక మంచు మనోజ్ కాకుండా, మిగిలిన హీరోల విషయానికి వస్తే, రవితేజతో పాటు విశ్వక్ సేన్ కూడా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. అలాగే, మరో తమిళ హీరో కూడా నటిస్తున్నాడట. అయితే, ఈ మ‌ల్టీస్టార‌ర్‌ అందరి కంటే మంచు మనోజ్ కి కీలకం కానుంది. చాలా గ్యాప్ తర్వాత మనోజ్ ఈ మ‌ల్టీస్టార‌ర్‌ చేస్తున్నాడు. పైగా మనోజ్ పై క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయట. ఒక విధంగా మనోజ్ కి ఇది రీ ఎంట్రీ లాంటి సినిమానే. మరి మంచు మనోజ్ కెరీర్ కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగ పడుతుందో చూడాలి. నిజానికి మనోజ్ కి సరైన బ్లాక్ బస్టర్ ఇప్పటి వరకు పడలేదు.

మనోజ్ కెరీర్ లో అన్నీ యావరేజ్ చిత్రాలు మరియి ప్లాప్ లు మాత్రమే ఉన్నాయి. కానీ, మనోజ్ నటించిన చిత్రాల్లో మ్యాటర్ అయితే ఉంది. అందుకే, ఇప్పటికీ మనోజ్ కి యూత్ లో కాస్త క్రేజ్ ఉంది. కాబట్టి, ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా మనోజ్ ఒక్క బ్లాక్ బస్టర్ అయినా కొట్టాలి. మనోజ్ కథాబలం ఉన్న మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే తీయాలి, సాలిడ్ హిట్ పడిన తర్వాతే భారీ బడ్జెట్ మూవీ చెయ్యాలి. అప్పుడే మనోజ్ కెరీర్ కి మంచిది. మరి ఈసారి అయినా మనోజ్ “భారీ” హిట్ ఇస్తాడా? చూడాలి.

Also Read:సి‌ఎం అంటే ‘గుంపుమేస్త్రి’.. ఇదేనా రేవంత్ నాలెడ్జ్‌!

- Advertisement -