కేటీఆర్‌ చెప్పిందే కరెక్ట్‌…

231
- Advertisement -

డ్రగ్స్ కేసు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్ గా మారింది. టాలీవుడ్‌ కు చెందిన స్టార్స్‌ డ్రగ్స్‌కి బానిసయ్యారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ను నిన్న సిట్‌ విచారించిన విషయం తెలిసిందే.

manchu laxmi  tweet  on digvijaysing for drugs

కాగా డ్రగ్స్‌ కేసులో పలువురు సినీ స్టార్స్ కూడా ఉన్నారని వారిని కూడా త్వరలోనే బయటపెడతారంటూ..కొంతమంది పేర్లు కూడా బయటకొచ్చాయి. ఇదిలా ఉంటే..డ్రగ్స్‌ వ్యవహారంపై పలువురు సినీ స్టార్స్‌ రియాక్ట్‌ అవుతున్నారు.

డ్రగ్స్‌ కేసును సంచలనం చేయడం సరికాదని, దర్యాప్తులో వివరాలు తెలిసేవరకు కాస్త ఓపికతో ఉండటం మంచిదంటూ చెప్తున్నారు.

  manchu laxmi  tweet  on digvijaysing for drugs

ఇక ఇదే వ్యవహారంపై.. తెలంగాణ డ్రగ్స్ ఊబిలో కూరుకుపోయిందని… భారీ డ్రగ్స్ స్కామ్ జరిగిందని, ఇందులో ఇరుక్కున్న వ్యక్తులకు టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న నేపథ్యంలో డిగ్గీరాజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ కు మంత్రి కేటీఆర్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల నుంచి రిటైరై, వయసుకు తగ్గ పనులు చేసుకోవాలంటూ కేటీఆర్ సూచించారు.

manchu laxmi  tweet  on digvijaysing for drugs

.

ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలకు సినీ నటి మంచు లక్ష్మి మద్దతు పలికారు. దిగ్విజయ్ పై మంచు లక్ష్మి కూడా మండిపడ్డారు. రామ్ (కేటీఆర్) చెప్పినట్టుగానే దిగ్విజయ్ ఎప్పుడో మతి స్థిమితం కోల్పోయారంటూ ట్వీట్ చేసింది.

- Advertisement -