మంచు లక్ష్మి పై ఘోరమైన కామెంట్లు

39
- Advertisement -

మంచు లక్ష్మి ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. తాజాగా స్వలింగ సంపర్కుల పై షాకింగ్ కామెంట్స్ చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పు నిరాశ కలిగించింది. దీని గురించి రాస్తున్నప్పుడు నా గుండె పగిలిపోయింది. అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజమైన అవమానం’ అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఐతే, మంచు లక్ష్మి స్వలింగ సంపర్కుల పై ఇలా ఎమోషనల్ అవ్వడంతో.. నెటిజన్లు నెగిటివ్ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.

మంచు లక్ష్మి స్వలింగ సంపర్కుల పై తెగ ప్రేమను కురిపిస్తోంది ?, అసలు కారణం ఏమై ఉంటుంది ?, బహుశా తాప్సీకి – రకుల్ ప్రీత్ సింగ్ కు తెలిసి ఉంటుంది ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మంచు లక్ష్మి ఆ ఇద్దరు హీరోయిన్లతో చాలా చనువుగా ఉంది. పలు మిడ్ నైట్ పార్టీలలో కూడా వారితో ఆమె కనిపించేది. ఈ క్రమంలో వాళ్ళు దిగే ఫోటోలు కూడా చాలా క్లోజ్ గా ఉండేవి. ఏదో లవర్స్ కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నట్లు ఉండేవి. అందుకే, నెటిజన్లు ఇలా రియాక్ట్ అవుతూ మెసేజ్ లు చేస్తున్నారు. ఈ మెసేజ్ ల పై మంచు లక్ష్మి ఇంకా రియాక్ట్ కాలేదు.

ఇక మంచు లక్ష్మి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన మంచు లక్ష్మి.. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన, ఆసక్తి లేదు. నా దృష్టి సినిమాలపై మాత్రమే ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి కథలు ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో పని చేస్తాను. నేను తెలుగు అమ్మాయిని కాబట్టి ఎక్కువగా ఆ చిత్రాల్లోనే నటిస్తా అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

Also Read:KTR:కాంగ్రెస్‌ది బస్సుయాత్ర కాదు తుస్సుయాత్ర

- Advertisement -