గ్రీన్‌ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన విద్యార్థులు

135
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించబడిన గ్రీన్ ఇండియాలో అనేక మంది పాల్గొన్ని మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటడమే కాకుండా ప్రజలకు మొక్కల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్‌ మంచిర్యాల బ్రాంచ్‌ ప్రిన్సిపాల్‌ కవిత, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ కవిత మాట్లాడుతూ.. ఒక మంచి సదుద్దేశంతో ప్రారంభించిన ఈ హరిత ఉద్యమంలో అందరూ భాగస్వామ్యులై మన భూమిని కాపాకుందామన్నారు. పర్యావరణ పరిరక్షణకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సృష్టికర్త అయిన ఎంపీ సంతోష్‌కుమార్‌ని అభినందించారు.

ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశము కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్‌ హారిక, కోఆర్డినేటర్‌ రవళి ప్రియా, అకాడమిక్‌ డీన్‌ ఆంజనేయులు, ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ సంతోష్‌ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

గ్రేటర్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు..

వెండితెర వెనుక ఎన్నో వ్యథలు

పదిలో పదకొండు కాదు..ఆరు పేపర్లు

- Advertisement -