ట్రంప్తో కలిసి పనిచేయడానికి సిద్దమేనని ప్రకటించారు న్యూయార్క్ మేయర్ మమ్దానీ. న్యూయార్క్ ప్రజలకు ప్రయోజనం చేకూరే ఏ అజెండాపై అయినా కలిసి పనిచేస్తానని వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన మేయర్ జోహ్రన్ మామ్దానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకు అనేక విభేదాలు ఉన్నప్పటికీ, న్యూయార్క్ వాసులకు ప్రయోజనం చేకూర్చే ఏ అజెండాపై అయినా ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
నవంబర్ 4న జరిగిన ఎన్నికల తర్వాత మామ్దానీ, ట్రంప్తో ఈరోజు (శుక్రవారం) వైట్హౌస్లో మొదటిసారి సమావేశం కానున్నారు. అధ్యక్షుడితో నాకు అనేక విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ, ప్రతి న్యూయార్క్ వాసికి మన నగరాన్ని అందుబాటు ధరలో ఉంచడానికి వీలు కల్పించే ప్రతి మార్గాన్నీ, ప్రతి సమావేశాన్నీ మేము పట్టుదలతో కొనసాగించాలి అని మామ్దానీ అన్నారు.
న్యూయార్క్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఏ అజెండాపై అయినా నేను ఆయనతో కలిసి పనిచేస్తానని అధ్యక్షుడు ట్రంప్కు స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఏ అజెండా అయినా న్యూయార్క్ ప్రజలకు హాని కలిగించినట్లయితే, దాన్ని మొదటగా ప్రశ్నించేది కూడా నేనే అవుతాను అన్నారు.ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి తన బృందం వైట్హౌస్ను సంప్రదించిందని మామ్దానీ తెలిపారు. ఎందుకంటే, ఈ నగరంలో నివసిస్తున్న ఎనిమిదిన్నర మిలియన్ల మందికి పైగా ప్రజల జీవితాన్ని మరింత అందుబాటు ధరలో ఉంచడానికి నేను ఎవరితోనైనా పనిచేస్తాను అన్నారు.
Also Read:’12A రైల్వే కాలనీ’…డిఫరెంట్ జోనర్

