కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ..

345
kcr mamatha
- Advertisement -

తెలంగాణలో టీఆర్ఎస్‌ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, కర్ణాటక సీఎం కుమార స్వామితో పాటు వైకాపా అదినేత వైఎస్‌ జగన్‌ ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు.

కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచీ భారీ ఆధిక్యత దిశగా టీఆర్ఎస్ దూసుకుపోయింది. మొత్తంగా టీఆర్ఎస్ 46 స్థానాల్లో గెలుపొందగా మరో 45 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. గజ్వేల్‌లో కేసీఆర్‌ 50వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.

కాంగ్రెస్ దిగ్గజాలు కేసీఆర్ సునామీలో కొట్టుకుపోయారు. రేవంత్,పొన్నాల,జీవన్ రెడ్డి,గీతా రెడ్డి,డీకే అరుణ,జానా రెడ్డి,కోమటిరెడ్డి ఓటమి పాలయ్యారు.

- Advertisement -