ప్రధాని మోదీతో దీదీ భేటీ.. కీలక చర్చ..

154
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసానికి వెళ్లి ఆమె సమావేశమయ్యారు. మూడోసారి సీఎం అయ్యాక ఆమె మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి.. భేటీ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించుకున్నారు. చర్చ అనంతరం ప్రధాని నివాసం నుంచి ఆమె వెళ్లిపోయారు.

భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమె ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఐదు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో బుధవారం మమత భేటీ అవుతారు. టీఎంసీ ఎంపీలతో కూడా ఆమె సమావేశం కానున్నారు.

- Advertisement -