మేజర్‌…ట్రైలర్‌

56
major
- Advertisement -

డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2008 ముంబై దాడులో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4:59 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సోనీ పిక్చర్స్‌, ఏ+ఎస్ మూవీస్‌తో కలిసి జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్‌పై మహేశ్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్‌తో అంచనాలు బాగానే పెరిగిపోవడంతో, ట్రైలర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ళ కథానాయికలుగా నటిస్తున్నారు.

- Advertisement -