మహేష్‌ నిర్మాతగా అడవిశేషు ‘మేజర్‌’

213
mahesh producer
- Advertisement -

ఓ వైపు వరుస సినిమాలతో మరోవైపు బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నారు హీరో మహేష్. తాజాగా మరో బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు మహేష్‌. క్షణం, గూఢచారి లాంటి సూపర్‌ హిట్ సినిమాలతో అలరించిన అడవి శేష్‌ హీరోగా ఓ బయోగ్రాఫికల్‌ మూవీని నిర్మిస్తున్నాడు మహేష్‌. ఈ సినిమాకు మేజర్ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

2019 వేస‌విలో సినిమా షూటింగ్‌ ప్రారంభించనుండగా 2020లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ద్వి భాషా చిత్రంగా తెలుగు, హిందీ భాష‌ల్లో భారీ బడ్జెట్‌తో యదార్థ ఘటనల నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో సోనీ పిక్చ‌ర్స్ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది.

26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాతో రచయితగా మారనున్నారు అడవి శేష్‌. గూఢ‌చారి ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ప్యాడ్ మాన్‌, 102 నాటౌట్ వంటి బాలీవుడ్ చిత్రాల‌తో పాటు మ‌ల‌యాళ చిత్రం 9ని ప్రేక్ష‌కుల‌కు అందించి వారికి ద‌గ్గ‌ర‌య్యామని సోనీ పిక్చ‌ర్స్ ఇంటర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్ హెడ్ తెలిపారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఇలాంటి ఓ గొప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు సోని పిక్చర్స్‌.

జిఎంబి బ్యాన‌ర్‌లో ఇలాంటి యూనిక్, ఒరిజిన‌ల్ స్టోరీ తెర‌కెక్కించ‌బోతున్నందుకు హ్య‌పీగా ఉందని నమ్రతా శిరోద్కర్ తెలిపారు. ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సినిమాల‌ను తీసుకొచ్చేలా సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి ముందుకు వెళ్తామన్నారు.

- Advertisement -