నాగ్ – మహేశ్‌ మల్టీస్టారర్!

29
mahesh
- Advertisement -

త్వరలో టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్‌ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నాగ్ హీరోగా నటించిన ది ఘోష్ట్ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మహేష్.

ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్…..చిత్రయూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీనికి నాగార్జున స్పందిస్తూ…ట్రైలర్ రిలీజ్‌ చేసినందుకు థ్యాంక్స్. హే.. మహేశ్‌!! 29 ఏళ్ల క్రితం వారసుడు సినిమాలో నాతో కలిసి మీ నాన్న సూపర్‌స్టార్‌ కృష్ణగారు కలిసి నటించినప్పుడు చాలా ఆనందించాను. మనం కలిసి సినిమా ఎందుకు చేయకూడదు? ఆ సర్కిల్ ని ఎందుకు కంప్లీట్ చేయకూడదు” అని మహేశ్‌ని అడిగారు.

దీనికి స్పందించిన మహేశ్‌.. కచ్చితంగా చేద్దాం. దానికోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడె వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -