మహేష్ పై యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్

43
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ కి చిన్నపాటి బ్రేక్ పూర్తవడంతో త్రివిక్రమ్ ఈ రోజు నుంచి నవంబర్ 20 వరకూ గుంటూరు కారం కొత్త షెడ్యూల్ బిగిన్ చేసారు. శంషాబాద్ లో వేసిన సెట్ లోనే ఈ సినిమాకి సంబందించిన పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ శ్రీలీల తో పాటుగా జగపతిబాబు కూడా పాల్గొంటారని సమాచారం. గుంటూరు కారం షూటింగ్ మొదలు పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు గ్యాప్ ల గ్యాప్ లు తీసుకుంటూ షూటింగ్ ని చేస్తున్నారు మహేష్.

ఐతే, ఇక నుంచి ఈ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారట త్రివిక్రమ్. పక్కా స్క్రిప్టుతో సెట్స్ మీదకు రావడంతో చిత్రీకరణకు ఎలాంటి అవాంతరాలు రాకపోవడం.. అన్నీ షూటింగ్ శరవేగంగా జరగడానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. మహేష్ కూడా చిన్నపాటి బ్రేక్స్ అంటే ఓ ఐదారు రోజులు తప్ప షూ. టింగ్ కి ఇక పెద్దగా బ్రేక్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అన్నట్టు గుంటూరు కారం పై ఉన్న క్రేజ్ తో ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం ఓటిటీ హక్కుల కోసం ట్రై చేస్తుందట.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ గుంటూరు కారం. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే, టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. అయితే, గుంటూరు కారం సినిమాతో బాలీవుడ్ లో కూడా మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు.

Also Read:విజువల్ ట్రీట్‌లా షారుఖ్..డంకీ!

- Advertisement -