చిరంజీవి గారు మీకోసం ఎదురుచూస్తున్నాంః మహేశ్ బాబు

471
Sarileru Nikevaru chiranjeevi
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్ రాజ్, బండ్ల గణేశ్ పలువురు కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈమూవీని జనవరి 11న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా జనవరి 5న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈసందర్భంగా హీరో మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.

డియర్ చిరంజీవి గారూ, మా ఆహ్వానాన్ని మన్నించి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు వస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.”మేం పిలవగానే ఎంతో వినమ్రంగా అంగీకరించారు. మా వేడుకల్లో పాలుపంచుకోవడానికి మీరు వస్తుండడంతో సంతోషం పట్టలేకపోతున్నాం. మీ రాకతో మా ఆనందం రెట్టింపవుతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది సర్” అంటూ మహేశ్ బాబు పోస్టు చేశారు.

- Advertisement -