త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ వింటారు- మహేష్‌ బాబు

67
- Advertisement -

ఈరోజు ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్‌ ప్రముఖుల భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ స‌మావేశంలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు. ప్ర‌భుత్వం ముందు టాలీవుడ్ ప్ర‌ముఖులు ప‌లు ప్ర‌తిపాద‌న‌లు ఉంచారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు.

సూపర్‌ స్టార్‌ మ‌హేష్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ.. మొద‌ట‌గా చిరంజీవి గారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల‌ని అన్నారు. ఆయ‌న మొద‌టి నుంచీ చొర‌వ చూపి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశార‌ని అన్నారు. ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ వింటార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వారం,ప‌ది రోజుల్లోనే ఆ శుభవార్త వ‌స్తుంద‌ని చెప్పారు.

- Advertisement -