మహేశ్ బాబు మూవీలో శర్వానంద్!

280
sharwanand
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేస్తూ మరోవైపు నిర్మాణ రంగ సంస్ధను నడిపిస్తున్నాడు. జీఎంబి ఎంటర్ టైన్ మెంట్ పేరుతో నిర్మాణ సంస్ధ ఏర్పాటు చేసి పలు సినిమాలు నిర్మిస్తున్నాడు. మహర్సి , సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల నిర్మాణంలో మహేశ్ బాబు భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన నిర్మాణ సంస్ధలో వెబ్ సిరీస్ లను కూడా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఉన్న సమాచారం మేరకు ఓ యువ హీరోతో తన బ్యానర్ లో సినిమాను నిర్మించనున్నారు మహేశ్ బాబు.

హీరో శర్వానంద్ తో త్వరలోనే ఈసినిమాను నిర్మించనున్నట్లు సమచారం. ఇటివలే మహేశ్ బాబు ఓ దర్శకుడు కథ వినిపించాడట. ఈ కథకు శర్వానంద్ అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడని భావించిన మహేశ్ తన బ్యానర్ లో ఈసినిమా చేద్దామని చెప్పాడట. దీంతో దర్శకుడు వెంటనే శర్వానంద్ కు కథను వినిపించాడట. కథ నచ్చడంతో శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

- Advertisement -