మరోసారి మహేశ్ తో కొరటాల శివ

305
Prince-Mahesh-Babu-Gifts-Audi-A6-to-Koratala-Siva
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈమూవీలో ఆర్మీ మేజర్ పాత్రలో మహేశ్ కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈసినిమాలో మహేశ్ కు జోడిగా రష్మీక మందన నటిస్తోంది. సంక్రాంతికి ఈసినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్రయూనిట్.

ఇక ఈసినిమా తర్వాత మహేశ్ తన తర్వాతి ప్రాజెక్ట్ ను ఇంకా ఖరారు చేయలేదు. గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ పేరు వినిపిస్తున్న ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక తాజాగా ఉన్న సమాచారం ప్రకారం మహేశ్ తన తర్వాతి మూవీ కొరటాల శివతో తీయనున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరు కలిసి పనిచేయాలని భావిస్తున్నారట. అయితే ఈసారి కొరటాల దర్శకుడిగా కాకుండా నిర్మాతగా వ్యవహరించనున్నాడట. ఎన్నాళ్ళ నుండో నిర్మాతగా మారాలనే ఆశ ఉన్న కొరటాల త్వరలో మొదలుకానున్న మహేష్, పరశురామ్ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది.

- Advertisement -