ప్చ్.. మహేష్ మళ్లీ ఆగుతూ సాగుతూ!

23
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఆగుతూ సాగుతూ కొనసాగుతోంది. తాజాగా మళ్ళీ ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. కారణం మహేష్ బాబే. ఆయన 3 రోజులు షూటింగ్ చేస్తే 15 రోజులు బ్రేక్ తీసుకుంటున్నారని యూనిట్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26న కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ మరో రెండు రోజులు ఉంది. కానీ, మహేష్ ఆ రెండు రోజుల షూటింగ్ ను మధ్యలోనే ఆపేశాడు. మరో పది రోజులు గ్యాప్ ఇవ్వాలని మహేష్ అనుకుంటున్నాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదటి నుంచి ఇలానే లాంగ్ బ్రేకులు తీసుకుంటూ సాగుతోంది.

కానీ, నిర్మాత నాగవంశీ ఈ సినిమాని తమ సంస్థలోనే భారీ సినిమాగా ప్లాన్ చేశాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నామని ఇప్పటికే ఘనంగా ప్రకటించాడు. కానీ, షూటింగ్ అలా అలా అలా వెళుతోంది. ఇప్పుడు దానికన్నా ముందు షూటింగ్ మధ్యలో ఆగిపోవడం వల్ల వచ్చే నష్టాలను భరించడం మరింత కష్టంగా వుంది. ఐతే, గుంటూరు కారం సినిమా ఎప్పుడొచ్చినా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని త్రివిక్రమ్ చెబుతున్నాడు. కాకపోతే.. ఇలా షూటింగ్ పోస్ట్ ఫోన్ చేసుకుంటూ.. బడ్జెట్ పెంచుకుంటూ పోతే.. సినిమా ఎంత గొప్ప హిట్ అయినా నష్టాలే వస్తాయని నాగవంశీ గట్టిగా నమ్ముతున్నాడు.

కానీ, త్రివిక్రమ్ మాత్రం ఇది తనకు సరైన పాన్ ఇండియా మూవీ అని భావిస్తున్నారు. మహేష్ మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావడానికి వీలు లేదు అని మాట తీసుకున్నాడు. కారణం..రాజమౌళి సినిమాతో తాను పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తే.. వచ్చే క్రేజ్ వేరు అని మహేష్ నమ్మకం. మొత్తమ్మీద గుంటూరు కారం సినిమా పై ఎవరి నమ్మకాలు వారికీ ఉన్నాయి. కానీ సినిమా పైనే సరైన నమ్మకాన్ని క్రియేట్ చేయలేకపోతున్నారు.

Also Read:T Hub:టీ-హబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

- Advertisement -