పారిస్ లో భరత్.. ఫ్యామిలీతో పుల్ ఎంజాయ్

260
mahesh babu.. namratha
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు. గత రెండేళ్లు గా సక్సెస్ లేక బాధపడుతున్న మహేష్ , భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ తో రెండేళ్ల బాధ మొత్తం ఒక్క దెబ్బతో పోయింది. ఈ సక్సెస్ ను తన ఫ్యామిలీ తో జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీ తో కలిసి పారిస్ టూర్ వేసాడు.

mahesh babu.. namratha

సినిమా రిలీజ్‌కి ముందే ఓ సారి పారిస్ వెళ్లొచ్చిన మ‌హేష్ మ‌రోసారి అదే ప్ర‌దేశానికి వెళ్ళాడు. అక్క‌డ అంద‌మైన లొకేష‌న్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఈఫిల్ ట‌వర్ వ‌ద్ద త‌న ఫ్యామిలీతో సెల్ఫీ దిగిన న‌మ్ర‌త ఆ ఫోటోల‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పారిస్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న మ‌హేష్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు మే రెండో వారం  ఇండియాకి రానున్నాడ‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లో వంశీ పైడిప‌ల్లి సినిమా టీంతో జాయిన్ కానున్నాడు మ‌హేష్‌. ఈ చిత్రం తొలి షెడ్యూల్ న్యూయార్క్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -