మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు మ‌హేష్ సాయం..

474
mahesh
- Advertisement -

దాదాపు 195 దేశాలను భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ ప్రభావం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సైతం దీని బారినపడ్డాయి. ఈ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వాలు చేస్తున్న కృషికి త‌మ వంతుగా సహయం అందించేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులంతా ముందుకొస్తున్నారు. తాజాగా దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. తాజాగా మ‌హేష్‌బాబు కోటి రూపాయ‌ల విరాళాన్ని అందించారు.

క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్ర‌భుత్వాలు చ‌క్క‌టి ప్ర‌య‌త్నాల్ని చేస్తున్నాయ‌ని, ఈ పోరాటంలో త‌న వంతు భాగ‌స్వామ్యంగా తెలంగాణ‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధిల‌కు కోటి రూపాయ‌ల్ని విరాళంగా ఇస్తున్న‌ట్లు మ‌హ‌ష్‌బాబు తెలిపారు. బాధ్య‌తయుత‌మైన పౌరులుగా ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించి నియ‌మ‌నిభంద‌న‌ల్ని పాటించాల‌ని మ‌హేష్‌బాబు సూచించారు.

- Advertisement -