మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంతో పూర్తి స్థాయి రాజకీయ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా ఈ మధ్యే విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా తన సత్తాను చాటుతోందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్నాడు సూపర్ స్టార్. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత చేయబోయే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మహేష్.
వంశీ పైడిపల్లి సినిమా తర్వాత సుకుమార్తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాతో మంచి టాక్తో విమర్శకుల ప్రసంశలందుకుంది. అయితే మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రం పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం అలాంటి తప్పిదం జరగదన్న ఆలోచనల్లో వీరిద్దరు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వీరిద్దరు చేయబోయే సినిమాను రంగస్థలం చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
Superstar Mahesh Babu + Mythri Movie Makers + Sukumar#Mahesh26 – 2019 Worldwide pic.twitter.com/RveUzTVpIM
— Mythri Movie Makers (@MythriOfficial) April 22, 2018