త్వరలో కృష్ణ మెమోరియల్ ట్రస్ట్‌…

159
- Advertisement -

ఆంధ్రా జెమ్స్‌బాండ్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిని సూపర్‌ కృష్ణ జ్ఞాపకార్థం సినీ జనాల కోసం కృష్ణ మెమోరియల్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్‌లో టాక్. కృష్ణ అనునిత్యం సినీ కార్మికుల కోసం కష్టపడ్డ వ్యక్తిగా సుపరిచతమే. త్వరలో ఘట్టమనేని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో సూపర్‌ స్టార్ కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మెమోరియల్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహంతోపాటు ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, ఇతర విశేషాలను ప్రతిబింబించేలా మహేశ్‌బాబు అండ్ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా తెలుగు చలనచిత్రపరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు కృష్ణ. నిర్మాతగా పద్మాలయ స్టూడియోస్‌ ద్వారా సక్సెస్‌ పుల్‌ చిత్రాలను నిర్మించారు.

సాధారణ నటుడి నుంచి సూపర్‌స్టార్‌గా సాగిన కృష్ణ జర్నీ విశేషాలు మెమోరియల్ ద్వారా అందరికీ అందుబాటులోకి రానున్నాయి. మెమోరియల్‌ను పద్మాలయ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

వైరలవుతున్న ఆలనాటి జ్ఞాపకం కానీ…

టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న ప్రపంచ సుందరీ

వీళ్ల మధ్య …15ఏళ్ల అనుబంధం

 

- Advertisement -