కరోనాతో గాంధీ మునిమనవడు మృతి…

198
sathish
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనాతో లక్షలాది మంది మృతిచెందగా తాజాగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో మరణించారు.

కరోనాతో సతీష్ మృతి చెందినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా తెలిపారు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన తన సోదరుడికి కరోనా వైరస్‌ కూడా సోకిందని తెలిపారు. ఆయన నెల రోజుల నుంచి ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్స తీసుకుంటున్నారు.

సతీష్ ధుపేలియా మీడియా రంగంలో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. గాంధీ ప్రారంభించిన గాంధీ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -