లీకైన ‘మహర్షి’ షూటింగ్‌ పిక్స్‌.. వీడియో వైరల్‌

240
- Advertisement -

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూలు ముగిసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ షెడ్యూలులో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ కోసం త్వ‌ర‌లో అబుదాబి వెళ్ళ‌నుంది చిత్ర బృందం.

Maharshi

అయితే రీసెంట్‌గా జ‌రిగిన షెడ్యూల్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పచ్చ‌ని పొలాల్లో మ‌హేష్ మీడియాతో మాట్లాడుతున్న‌ట్టుగా ఒక పిక్ ఉండ‌గా, మ‌రో పిక్‌లో మ‌హేష్ అభిమానుల మ‌ధ్య నుండి వెళుతున్న‌ట్టుగా ఉంది.

ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్. ఏప్రిల్ 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

https://www.instagram.com/p/BtGvrYTnrso/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

- Advertisement -