చైనాను దాటేసిన మహారాష్ట్ర..

322
maharashtra coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ 5.0 పేరుతో కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వడంతో రోజుకు పదివేల కరోనా కేసులు నమోదవుతుండగా నేటి నుండి ఆలయాలు,రెస్టారెంట్లు తెరచుకున్నాయి. దేశం మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య రెండున్నర లక్షలను దాటేసింది.

ఇక కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచంలో 5వ స్ధానంలో ఉండగా మహారాష్ట్ర ఏకంగా చైనానే దాటేసింది. గత 24 గంటల్లో ఇక్కడ 3,007 కొత్త కేసులు నమోదు కాగా ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 85,975కు చేరుకుంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 3 వేల మందికి పైగా మరణించారు.

తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 154 పాజిటివ్ కేసులు నమోదుకాగా 14 మంది కన్నుమూశారు. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 137కి చేరగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,650కి చేరింది.

- Advertisement -