మొక్కలు నాటిన మహబూబాబాద్ ఎంపీ కవిత..

591
mp kavitha
- Advertisement -

సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహార కార్యక్రమాన్ని తన గ్రీన్ ఛాలెంజ్‌లతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లతున్న ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత తన జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యేలు రెడ్యానాయక్,కాంతరావు, పెద్ది సుదర్శన్ రెడ్డి లకు మొక్కలు నాటాలని గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నరని దానికి మనమందరం సహకారం అందించాలన్నారు.తన జన్మదినం రోజున పేదలకు దుప్పట్లు,బడి పిల్లలకు నోట్ బూక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -