గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి!

95
mlc
- Advertisement -

తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. తొలుత కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించిన ఆ ఫైలును గవర్నర్ పెండింగ్‌లో పెట్టడంతో తిరిగి మధుసూదనాచారి పేరును ఎంపిక చేశారు.

ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపింది. ఫైల్‌ పై గవర్నర్‌ సంతకం పెట్టడమే తరువాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఈ ఫైల్‌ పై గవర్న్ ఇవాళ సంతకం పెట్టనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కీలకంగా పనిచేసిన మధుసూదనాచారి…స్పీకర్‌గా పనిచేశారు.

- Advertisement -