పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మధుయాష్కి సంచలనం

1
- Advertisement -

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ పాలసీలు నచ్చి రాలేదన్నారు. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో గంగారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ లక్ష్మణ్ తో కలిసి పరామర్శించారు మధుయాష్కి గౌడ్.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌పై ప్రేమతో పార్టీ మారడం లేదని దుయ్యబట్టారు. అక్రమాస్తులు కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్ కాపాడుకునేందుకు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నేత హత్య జరగడం బాధాకరమన్నారు.

ఎమ్మెల్యేలు చేరిన చోటల్లా వారికి పార్టీని రాసివ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొన్న వ్యక్తి గంగారెడ్డి అని… తనకి ప్రాణహాని ఉందని పోలీసులకి చెప్పుకున్నారని వెల్లడించారు. ప్రాణానికి ముప్పు ఉందని చెప్పిన పోలిసులు ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో‌ కాంగ్రెస్ నాయకులు హత్య‌ గురి కావడం బాధకరం అన్నారు. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలిసులు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

Also Read:KTR: పది నెలల్లోనే కరెంట్ ఛార్జీల పెంపా?

- Advertisement -