‘రాక్షస కావ్యం’…లిరికల్ సాంగ్

56
- Advertisement -

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి అమ్మ పాట లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు రాజీవ్ రాజ్, శ్రీకాంత్ ఎం ట్యూన్ కంపోజ్ చేయగా..శివాని సీహెచ్ పాడారు. నింగినై నిన్ను చూస్తుంటా..నేలనై నిన్నుమోస్తుంటా…గాలినై జోలపాటవుతా..వెన్నెలై నిన్ను లాలిస్తా..అంటూ బిడ్డలపై అమ్మ చూపే ప్రేమను వర్ణిస్తూ సాగుతుందీ పాట. అమ్మ గొప్పదనాన్ని తన సాహిత్యంలో మిట్టపల్లి సురేందర్ ఆవిష్కరించగా..ప్లెజంట్ ట్యూన్ లో హృదయానికి హత్తుకునేలా శివాని సీహెచ్ పాడింది.

Also Read:ఖమ్మం కాంగ్రెస్‌లో బీసీ చిచ్చు..

మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 6న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.

- Advertisement -