మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర..

79
- Advertisement -

వినియోగదారులకు షాక్. వంట గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్‌ బండ ధర రూ.1105కు చేరింది.

ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.18 పెరిగింది. వంట గ్యాస్ ధర పెంపుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -