లండన్‌లో మరోసారి వ్యాన్ బీభత్సం..

180
London vehicle hits pedestrians
- Advertisement -

ఇటీవల లండన్‌ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా పాదచారులను తొక్కించుకుంటూ వెళ్లి బీభత్సం సృష్టించిన ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. లండన్ లోని ఫిన్స్‌ బరీ పార్క్‌ లోని సెవెన్‌ సిస్టర్‌ రోడ్డులోని మసీదు సమీపంలో పాదచారులపైకి రాత్రి 12.20 నిమిషాల సమయంలో ఒక వ్యాన్‌ వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదిమందికి పైగా గాయపడ్డారు.

19brk30a

సెవెన్ సిస్టర్ రోడ్డును మూసి వేశారు. సమాచారం అందగానే రంగంలోకి దిగిన లండన్‌ మెట్రో పోలీసు, అత్యవసర సహాయ బృందాలు తమ పని ప్రారంభించాయి. ఘటనకు పాల్పడిన వారికోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ముస్లింలు రాత్రిపూట నిర్వహించే తరావీ ప్రార్థనల అనంతరం ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. లండన్ వంతెన వద్ద ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోకముందే మరోసారి వ్యాన్ బీభత్సం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -