సాయంత్రం లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్..

250
election commission
- Advertisement -

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం. అందుకు తగ్గట్టుగా ఈసి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా… ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

దేశ వ్యాప్తంగా తొమ్మిది లేదా 10 విడతల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి..ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ప్రస్తుత లోక్ సభ పదవికాలం జూన్ 3వ తేదితో ముగియనుంది. ఏప్రిల్ -మే నెలలో మధ్య ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

- Advertisement -