లోకేష్‌ మళ్లీ… వేసేశాడు !

175
Lokesh Another funny comments
Lokesh Another funny comments
- Advertisement -

నిన్న కాకమొన్న మంత్రి అయ్యాడో లేదో సోషల్ మీడియాలో ఇప్పుడు లోకేష్‌కి సంబంధించిన వార్తలే వైలర్‌ అవుతున్నాయి. మంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో సార్వ భౌ అంటూ పదాలను పలకడంలో ఇబ్బంది పడ్డ ఈ యువ మంత్రి  పొరబడ్డారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున.. వర్ధంతి అని, ఏప్రిల్ 18న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో పర్యటిస్తూ ..‘రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని నారా లోకేష్ పొరపాటుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి లోకేష్ నోరుజారారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన లోకేశ్ ప్రసంగిస్తూ మరోమారు పొరపాటు పడ్డారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని అన్నారు. దీంతో, కార్యకర్తలు, ప్రజలు కంగుతిన్నారు. ఏపీ అసెంబ్లీ మొత్తం స్థానాల సంఖ్య 175 ఉంటే…మరో 25 స్థానాలు అదనంగా ఎక్కడి నుంచి వచ్చాయని ఆశ్చర్యపోయారు. దీంతో నెటిజన్లు లోకేష్ వీడియో రిలీజ్‌ అయితే చాలు ఎగబడి చూస్తున్నారు. కామెంట్లు,షేరింగ్‌లతో హోరతిస్తున్నారు.

- Advertisement -