ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా

322
ecrameshkumar
- Advertisement -

కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణలో మార్చ్ 31 వరకు స్కూళ్లు, థియేటర్లను మూసేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో ఆంధ్రప్రదేశ్ లో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. తాజాగా ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిపారు.

ఎన్నికలు రద్దు కాలేదని కేవలం వాయిదా మాత్రమే పడినట్లు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డట్లు చెప్పారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నామని.. అత్యున్నతస్థాయి సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొన్నారు.

- Advertisement -