అధిక ధరల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, నీళ్లను కలుపుతున్న కేటుగాళ్ల ముఠాను పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. బార్లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు.
లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప సోసైటీ ప్రాంతంలో ట్రూప్స్ బార్ను రెన్యువల్ చేయలేదు.. ఫీజు కూడా చెల్లించలేదని బార్లోకి వెళ్లారు అధికారులు. అయితే బార్లో ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసి తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని కలుపుతుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు అధికారులు.
రూ. 2690 ధర గల జేమ్సన్ బాటిల్లో రూ.1000 ధర కలిగిన ఓక్స్మిత్ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నారు అధికారులు. 75 కల్తీ బాటిళ్లను, 55 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ సిబ్బంది.బార్ లైసెన్స్, ఓనర్ ఉద్యాకుమార్ రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణ రెడ్డి, బార్లో పని చేసే ఉద్యోగి పునిత్ పట్నాయక్లపై కేసు నమోదు చేసి లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు అధికారులు.
Also Read:కేసీఆర్..తెలంగాణ జాతిపిత సాంగ్

