మీ బ్యాంకులకి చెప్పండి.. ఎవరు దొంగో నిర్ణయించండి..

454
vijay
- Advertisement -

భారత బ్యాంకులకు రూ. 9వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యాను నెటిజన్లు మరోసారి ట్రోల్‌ చేశారు. ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్‌ జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన మాల్యా..వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌తో ఫొటో దిగాడు. ఈ ఫొటోను గేల్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. బిగ్‌ బాస్‌ విజయ్‌ మాల్యాతో ఫొటో దిగడం గొప్పగా ఉందని క్యాప్షన్‌ ఇచ్చి దాన్ని షేర్‌ చేశాడు.

దీంతో నెటిజన్లు కాసేపు గేల్‌ను ట్రోల్‌ చేశారు. బ్యాంకులకు రుణం ఎగ్గొట్టి తిరిగేవాడిని బిగ్‌బాస్‌ అంటారేంటి అని నెటిజన్లు గేల్‌ మీద కామెంట్లు చేశారు. గేల్‌కి కూడా మాల్యా గొప్పగా కనిపిస్తున్నారంటూ మీమ్‌లు కూడా తయారు చేసి పెట్టేశారు.పలువురు నెటిజన్లు “దొంగ… దొంగ” అని కామెంట్లు పెట్టారు. అయితే వీటిపై మాల్యా స్పందించాడు. నెటిజన్లను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేశాడు.

తన స్నేహితుడు, యూనివర్సల్ బాస్‌ క్రిస్ గేల్‌ ను కలడవం ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. తనను కొందరు అదే పనిగా ట్రోల్ చేస్తున్నారని, తనను దొంగ అంటున్నవారంతా మెదడులేనివారేనని మండిపడ్డారు. ఇచ్చిన డబ్బులు వసూలు చేయమని మీ బ్యాంకులను నిలదీయాలని, తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తానని సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నానని అన్నారు.దొంగ ఎవరో? తేల్చుకోవాలంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

 

- Advertisement -