ఈ మధ్య ఓటీటీల పై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో మిస్ అయిన సినిమాల కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మూడు సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెదకాపు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
అలాగే మరో సినిమా విషయానికి వస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ మ్యాడ్. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నవంబర్ మొదటి వారంలో మ్యాడ్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.
ఇక మరో సినిమా విషయానికి వస్తే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘లియో’. భారీగా హైప్ వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల అయింది. కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం నవంబరు 21 నుంచి OTTలో స్ట్రీమింగ్ కానుందట.
Also Read:ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు