- Advertisement -
వారం రోజులుగా ICISAT పరిశోధన కేంద్రంలో సంచరిస్తున్న చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. చిరుతను పట్టుకునేందుకు ఇక్రిశాట్ పరిశోధన కేంద్రంలో పలు ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేశారు.
రెండు రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో చిరుత కనిపించింది..చిరుత సంచరించే ప్రదేశాలలో అధికారులు రెండు బోనులు ఏర్పాటు చేశారు.. బుధవారం రాత్రి సమయంలో చిరుత బోనులో చిక్కిందని మెదక్ జిల్లా DFO శ్రీధర్ రావు తెలిపారు.
చిరుతను వైద్య పరీక్షల నిమిత్తం నెహ్రూ జూ పార్క్ కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:60 దాటాక కూడా ఆరోగ్యంగా జవించాలంటే.. !
- Advertisement -

